కేరళ స్టోరీస్ డైరెక్టర్ కు అనారోగ్యం

by Dishafeatures2 |
కేరళ స్టోరీస్ డైరెక్టర్ కు అనారోగ్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేరళ స్టోరీస్ డైరెక్టర్ సుదీప్ తో సేన్ అనారోగ్యానికి గురైనట్లు ఆదివారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వాస్తవానికి ఆయన కేరళ స్టోరీస్ బృందంతో పాటు కరీంనగర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్తా హిందూ యాత్రలో పాల్గొనాల్సి ఉంది. కానీ అనారోగ్య కారణాలతో వారు హాజరుకాలేకపోతున్నట్లు డైరెక్టర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

హిందూ ఏక్తా యాత్రకు, కరీంనగర్ ప్రజలను కలవలేకపోవడం బాధగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఇదిలావుండగా ముంబయిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తుండగా కేరళ స్టోరీ డైరెక్టర్ సుధీప్తో సేన్, హీరోయిన్ అదా శర్మ యాక్సిడెంట్ కు గురైనట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారు చెబుతున్నారు.

Also Read..

ఆకట్టుకుంటున్న సైంటిఫిక్ థ్రిల్లర్ KoKo First Glimpse


Next Story

Most Viewed